నితిన్ – శ్రీను వైట్ల – మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఎందుకు ఆగిపోయింది? అసలు కారణం ఇదేనా?

Nithiin walks out of Srinu Vaitla’s film with Mythri Movie Makers after remuneration issues. Director now hunts for a new hero post-Dasara.
నితిన్ – శ్రీను వైట్ల – మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఎందుకు ఆగిపోయింది? అసలు కారణం ఇదేనా?
టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్‌ల గురించి వినిపించిన ప్రతీ వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. అలాంటి హాట్ అప్‌డేట్ ఒకటి ఇటీవల ఫిల్మ్ నగర్‌లో హడావుడి చేసింది. హీరో నితిన్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా గురించి అందరికీ ఎగ్జైట్‌మెంట్. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ మీద నితిన్ అంగీకరించాడు. అంటే సినిమా లాభం వచ్చిన తర్వాతే తనకు రెమ్యూనరేషన్ వచ్చేది. ఇది మేకర్స్ కు కూడా కంఫర్ట్‌గా అనిపించింది. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా నితిన్ తన రెమ్యూనరేషన్ పెంచాలని కోరాడట. ఆ డిమాండ్‌ను మైత్రి మేకర్స్ అంగీకరించలేకపోయారు. దీంతో ఒప్పందం పూర్తిగా విరిగిపోయిందని సమాచారం. సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి సీనారియోలు కొత్త కాదు. Telugu Cinema లో తరచూ హీరో, దర్శకుడు, ప్రొడ్యూసర్ మధ్య ఆర్ధిక విభేదాలు వస్తుంటాయి. కానీ ఈసారి నితిన్ – శ్రీను వైట్ల కాంబినేషన్ పై అభిమానులకు ఉన్న అంచనాలు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తలు నిరాశ కలిగించాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచ…

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder.

Post a Comment