టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి భారీ ప్రాజెక్ట్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. 2027లో గ్యాంగ్స్టర్ పాత్రలో ఆయన నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతుండగా, ఆసియన్ సునీల్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.
SSMB29 తర్వాతే ఈ ప్రాజెక్ట్
ప్రస్తుతం మహేష్ బాబు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యాక వెంటనే గ్యాంగ్స్టర్ డ్రామా ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్మాత ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా లాక్ చేసినట్టు టాక్.
భారీ అంచనాలు
అనిమల్తో బ్లాక్బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న ఈ కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకా చదవండి: మిరాయ్ మూవీ రూ.100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ల దిశగా
ఈ గ్యాంగ్స్టర్ ప్రాజెక్ట్పై మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్లో ఇది ఒక బిగ్ బ్లాస్ట్గా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.