BreakingLoading...
WhatsApp logo

Telugu Vaadi TV

Follow our WhatsApp Channel

2027లో మహేష్ బాబు గ్యాంగ్‌స్టర్ అవతారం.. సందీప్ రెడ్డి వంగా కలయికతో భారీ ప్రాజెక్ట్!

Mahesh Babu teams up with Sandeep Reddy Vanga & Asian Sunil for a gangster role in 2027, post-SSMB29. A big pan-Indian blast awaits.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. 2027లో గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతుండగా, ఆసియన్ సునీల్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.

SSMB29 తర్వాతే ఈ ప్రాజెక్ట్

ప్రస్తుతం మహేష్ బాబు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యాక వెంటనే గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా లాక్ చేసినట్టు టాక్.

భారీ అంచనాలు

అనిమల్తో బ్లాక్‌బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న ఈ కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ గ్యాంగ్‌స్టర్ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో ఇది ఒక బిగ్ బ్లాస్ట్గా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

About the author

Mandava Sai Kumar
Chief Editor and Founder. Full Bio Details

Post a Comment

We will remove clearly commercial or spam-like posts