2019లో రిలీజ్ అయిన చిన్న సినిమా “కాంతారా” మొదటి రోజు కేవలం ₹3 కోట్లు వసూలు చేసి, చివరకు మొత్తం ₹400 కోట్లు గ్రాస్ తో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి సృష్టించింది. రిషబ్ శెట్టి తీసిన ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో కలెక్షన్లతో షాక్ ఇచ్చింది.
ఇప్పుడు అదే సిరీస్ కి ప్రీక్వెల్గా వస్తున్న “కాంతారా: చాప్టర్ 1” పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ బలహీనంగా ఉన్నాయని టాక్. అలాగే తెలుగు మార్కెట్లో కూడా బజ్ అంతగా పిక్ అవ్వలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ట్రైలర్ టుమారో
ఈ పరిస్థితుల్లో అసలు సినిమా రేంజ్ ని మార్చే కీలక అంశం ట్రైలర్ అని ఇండస్ట్రీలో అభిప్రాయం. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45 గంటలకు ట్రైలర్ లాంచ్ కానుంది. బాలీవుడ్ నుండి హృతిక్ రోషన్, టాలీవుడ్ నుండి ప్రభాస్, మలయాళం నుండి పృథ్వీరాజ్, తమిళనాడు నుండి శివకార్తికేయన్ కలిసి ఈ ట్రైలర్ ని లాంచ్ చేయబోతుండటంతో పాన్-ఇండియా దృష్టి అంతా “కాంతారా చాప్టర్ 1” మీదే పడింది.
హిట్ కంటెంట్ వస్తే కలెక్షన్లు స్కై హై!
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, సినిమా కంటెంట్ మళ్లీ మొదటి పార్ట్ లాగా హిట్ అయితే, కలెక్షన్లు సులభంగా ₹400 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంది. అమెరికా, తెలుగు మార్కెట్ లో వీక్ బజ్ ఉన్నా, ఒకసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే కలెక్షన్లు భారీ స్థాయిలో పెరగడం ఖాయం.
ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్
సోషల్ మీడియాలో ఇప్పటికే #KantaraChapter1, #RishabShetty ట్రెండింగ్ లో ఉన్నాయి. అభిమానులు “ట్రైలర్ తోనే మిరాకిల్ స్టార్ట్ అవుతుంది” అని నమ్ముతున్నారు. ఇండస్ట్రీలో కూడా “మొదటి రోజు స్లో అయినా, కంటెంట్ స్ట్రాంగ్ అయితే కాంతారా 2.0 ఎఫెక్ట్ వస్తుంది” అని టాక్ వినిపిస్తోంది.
మొత్తం మీద “కాంతారా చాప్టర్ 1” రేపు ట్రైలర్ తోనే తన బజ్ ని రీబిల్డ్ చేసుకోవాలి. అప్పుడే బాక్సాఫీస్ వద్ద మళ్లీ కాంతారా మ్యాజిక్ రిపీట్ అవుతుంది.